Chief Minister, Andhra Pradesh
Vijayawada, India
Joined on 8 January, 2015
రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు,సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని,రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను
#Sankranthi
Replying to @AndhraPradeshCM: నెల్లూరులో 'జగనన్న అమ్మ ఒడి' రెండో ఏడాది చెల్లింపులను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రారంభించారు. బటన్ నొక్కి 44,48,86…
నెల్లూరులో 'జగనన్న అమ్మ ఒడి' రెండో ఏడాది చెల్లింపులను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రారంభించారు. బటన్ నొక్కి 44,48,865 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.15వేలు చొప్పున రూ.6,673 కోట్లు జమచేశారు. ఈ ఏడాది 'జగనన్న అమ్మఒడి' ద్వారా 84 లక్షలమంది పిల్లలు లబ్దిపొందనున్నారు
As we begin this new chapter, wishing you all a joyous and healthy 2021. May this year bring peace and immense prosperity to our state and our people. I pray that you get the strength to fulfill all your dreams and aspirations. #HappyNewYear2021
Replying to @AndhraPradeshCM: వైయస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ 3వ విడత నిధులు, నివర్ తుపాను పంట నష్టానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులను ము…
వైయస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ 3వ విడత నిధులు, నివర్ తుపాను పంట నష్టానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా పంట నష్టపరిహారం, సంక్రాంతికి ముందే రైతుభరోసా నిధులు విడుదల చేస్తున్నామని సీఎం అన్నారు. (1/2)
“ పాదయాత్ర సమయంలో సొంతిల్లు లేని నిరుపేదల కష్టాన్ని కళ్లారా చూశాను. పేదల సొంతింటి కల నెరవేరుస్తానని నాడు మాట ఇచ్చాను. ఈ రోజు అక్షరాలా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం, అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూడడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను.”
రాష్ట్ర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పర్వదినం రోజున ముక్కోటి దేవతల ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆనందఆరోగ్యాలతో విలసిల్లాలని ప్రార్థిస్తున్నాను. #VaikuntaEkadashi
సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు మనలను సన్మార్గంలో నడిపించాలని, రాష్ట్ర ప్రజలపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
#MerryChristmas
I thank each and every one of you for your thoughtful and kind wishes. Reading your messages reminded me how incredibly blessed I am. Your love & support gives me strength to work harder and be better each day. 🙏
“బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు మీ సామాజిక వర్గంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా బాధ్యత తీసుకోవాలి. కార్పొరేషన్లలో సమూల మార్పులు రావాలి. రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం”
“బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నుముక కులాలు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. 18 నెలల్లోనే బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం”
Replying to @AndhraPradeshCM: “రాజకీయాలతో, పార్టీలతో సంబంధం లేకుండా, వివక్షకు తావులేకుండా, లంచాలకు అవకాశం లేకుండా...ప్రతి అర్హుడికీ పథకాలు అందాలనే…
“రాజకీయాలతో, పార్టీలతో సంబంధం లేకుండా, వివక్షకు తావులేకుండా, లంచాలకు అవకాశం లేకుండా...ప్రతి అర్హుడికీ పథకాలు అందాలనే తాపత్రయంతో కార్పొరేషన్ వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులకు శ్రీకారం చుట్టాం” - బీసీ సంక్రాంతి కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. #BRAmbedkar వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. అణగారిన ప్రజల వికాసానికి అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిది. ఆయన అందించిన రాజ్యాంగం భారత్ ను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిపింది. మహోన్నత ఆశయాలు,స్ఫూర్తిదాయకమైన ఆలోచనల రూపంలో అంబేద్కర్ ఎప్పటికీ బతికే ఉంటారు.
Replying to @AndhraPradeshCM: “హెరిటేజ్ షేర్లు చూస్తే షేర్ రిగ్గింగ్ చేస్తారేమోనని అనుమానం కలుగుతోంది. 1999లో రూ.2 లు ఉన్న షేర్ వాల్యూ చంద్రబాబు అధి…
“హెరిటేజ్ షేర్లు చూస్తే షేర్ రిగ్గింగ్ చేస్తారేమోనని అనుమానం కలుగుతోంది. 1999లో రూ.2 లు ఉన్న షేర్ వాల్యూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెరుగుతూ.. ఓడిపోగానే పడిపోతోంది. 2017 డిసెంబర్ లో ఏకంగా రూ. 827కి చేరింది. ఒడిపోగానే మళ్ళీ 2020 మార్చి నాటికి రూ. 205కి పడిపోయింది.”
Replying to @AndhraPradeshCM: “ఆరేళ్ళలోపే చిన్నారుల బ్రెయిన్ ఎదుగుదలకు మంచి సమయం. అలాంటి పిల్లలు, బాలింతలు, గర్భిణీల ఆరోగ్యం గురించి చంద్రబాబు ప…
“ఆరేళ్ళలోపే చిన్నారుల బ్రెయిన్ ఎదుగుదలకు మంచి సమయం. అలాంటి పిల్లలు, బాలింతలు, గర్భిణీల ఆరోగ్యం గురించి చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. ఐదేళ్లలో వారి కోసం రూ. 2761 కోట్లు ఖర్చు చేశాడు. మనం "వైయస్సార్ సంపూర్ణ పోషణ" ద్వారా ఏడాదికి రూ. 1900 కోట్లు ఖర్చు చేస్తున్నాం.”
Replying to @AndhraPradeshCM: గవర్నమెంట్ అనేది ఒక క్రెడిబులిటీ మీద జరుగుతోంది. ఈరోజు గర్వంగా చెబుతున్నా జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉం…
గవర్నమెంట్ అనేది ఒక క్రెడిబులిటీ మీద జరుగుతోంది. ఈరోజు గర్వంగా చెబుతున్నా జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అనంటే జగన్ అనే వ్యక్తి ఓ మాట చెబితే చేస్తాడు అని ప్రజలు నమ్ముతారు.
- సీఎం వైయస్ జగన్.
చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి. తల్లిదండ్రుల ఆశలకు ప్రతిరూపాలు వారు. ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువొక్కటే. అందుకే చిన్నారుల భవిష్యత్తుని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. #ChildrensDay2020
End of content
No more pages to load